Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత్లో మరింతగా విస్తరించే యోచనలో ఉన్న సుజుకీ మోటర్ సైకిల్ ఇండియా సంస్థ హైదరాబాద్లో మాన్యా సుజుకీ షోరూమ్ను ప్రారంభించింది. హిమాయత్నగర్ వై జంక్షన్ సమీపంలో ఏర్పాటు చేసిన మాన్యా సుజుకీ షోరూమ్ను సైకిల్ సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా సంస్థ ఎండీ సతోషీ ఉచీడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల అభిరుచుల మేరకు సంస్థ వివిధ ద్విచక్ర వాహనాలను అందుబాటులో ఉంచుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సజీవ్ రాజశేఖరన్, మాన్యా సుజుకీ ఎండీ మనోజ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.