Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా (ఎండీ) అరిజిత్ బసు నియమితుల య్యారు. ఆయన నియామకాన్ని ప్రభుత్వ శుక్రవారం ఖరారు చేసింది. ఐడీబీఐ అధినేతగా అదనపు బాధ్యతలు చూసేందుకు వెళుతున్న బి.శ్రీరామ్ స్థానంలో అరిజిత్ బసు బాధ్యతలను చేపట్టనున్నారు. ప్రస్తుతం బసు ఎస్బీఐలో కార్పొరేట్ ఖాతాల గ్రూపునకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టరుగా సేవలనందిస్తున్నారు. అంతకు ముందు ఆయన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అధినేతగా కూడా సేవలందించారు. అర్ధశాస్త్రంలో పట్టబద్రులైన బసు చరిత్రలో తన మాస్టర్స్ పూర్తి చేసి 1983లో ప్రొబేషనరీ ఆఫీసర్గా ఎస్బీఐలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థల్లో పలు కీలక పోస్టులు ఖాళీ అవుతన్న నేపథ్యంలో వాటికి సరితూగే అధికారుల కోసం సర్కారు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.