Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండిస్టీస్ (రిల్) మార్కెట్ విలువ దాదాపు 11 యేండ్ల తరువాత 100 బిలియన్ డాలర్లకు (దాదాపుగా రూ.7 లక్షల కోట్ల) చేరువైంది. గురువారం ట్రేడింగ్ ప్రారంభంలో రిలయన్స్ ఇండిస్టీస్ స్టాక్ దూసుపోయింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 బిలియన్ డాలర్ల(రూ.6,85,550 కోట్లకు పైగా) మార్కును దాటేసింది. అంటే రూ.7 లక్షల కోట్లకు చేరువలోకి వచ్చింది. కంపెనీ షేర్లు రూ.1,091 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకడంతో రిలయన్స్ ఇండిస్టీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఈ మేర పెరిగింది. రిలయన్స్ ఇండిస్టీస్ షేర్లు ఈ మేర దూసుకుపోవడం వరుసగా ఇది ఐదోరోజు. జూన్ క్వార్టర్ ఫలితాలకు ముందు కంపెనీ ఏజీఎంలో దూకుడు వ్యాపార ప్రణాళికను ప్రకటించిన నేపథ్యంలో రిలయన్స్ షేర్లు ఈ మేర లాభాలను ఆర్జిస్తున్నాయి. గురువారం ఈ కంపెనీ షేర్లు రూ.1,043.15 వద్ద ప్రారంభమయ్యాయి. అనంతరం రూ.1,091 వద్ద వెంటనే 52 వారాల గరిష్టాలను తాకాయి. 5.02 శాతం జంప్ చేసి, రూ.1,091 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. డాలర్ విలువతో పోల్చితే రిల్ షేర్ 2007 అక్టోబర్ 18 నాటి గరిష్ట స్థాయికి చేరింది.