Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూన్లో 5 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం
- మార్కెట్లో మండిపోతున్న ఆహార వస్తువుల ధరలు..
- మందగమనంలోనే దేశ పారిశ్రామిక వృద్ధి
న్యూఢిల్లీ: దేశంలో ధరలు భగ్గుమంటున్నట్టుగా సూక్ష గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా సర్కారు గురువారం విడుదల చేసిన గణాంకాలలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతోంది. జూన్ మాసంలో రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం అయిదు నెలల గరిష్టానికి ఎగిసి 5 శాతానికి చేరిందని సర్కారు గురువారం వెల్లడించింది. ఇది అంతకు ముందు మే నెలలో 4.87 శాతం వద్దనూ.. గత ఏడాది జూన్లో 1.46 శాతం వద్దనూ కొనసాగింది. ఈ ఏడాది జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం అత్యధికంగా 5.07 శాతంగా నమోదు అయింది. ఆ తరువాత మళ్లి రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతానికి పెరగడం ఇదే తొలిసారి. సర్కారు వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో ఆహార వస్తువుల ధరలు ఎక్కువగా మండిపోతున్నాయి. ఇవి గత నెలలో దాదాపు 2.91 శాతం మేర పెరిగాయి. అంతకు ముందు మే నెలలో వీటి భారం 3.1 శాతం మేర ఉన్నట్టుగా సర్కారు వివరించింది. విద్యత్తు, చమురు ధరలు కూడా జులైలో 5.8 శాతం నుంచి 7.14 శాతానికి పెరిగాయి. ద్రవ్యోల్బణం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో.. రానున్న రోజుల్లో ఆర్బీఐ వడ్డీరేట్లను సవరించే అవకాశాలున్నట్టుగా మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
3.2% చేరిన పారిశ్రామిక వృద్ధి..
దేశంలోని పారిశ్రామిక వృద్ధిలో మందగమన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత మే నెలల దేశ పారిశ్రామిక వృద్ధి 3.2 శాతంగా నమోదు అయింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది కేవలం0.03శాతమే అధికం కావడం విశేషం. కాగా మే మాసంలో తయారీ రంగంలోని మొత్తం 23 రకాల పరిశ్రమల్లో కేవలం 13 రకాల పరిశ్రమలు మాత్రమే పురోగతిని ప్రదర్శించాయి. మిగతావి వృద్థి కొరవడి కాలాన్ని వెల్లదీస్తున్నాయి. 2017 మే మాసంలో వృద్ధితో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో మైనింగ్, తయారీ, విద్యుత్తు రంగాలు వరుసగా 5.7%,2.8%,4.2% వృద్ధిని నమోదు చేశాయి. ఈ రంగాల్లోని కుములేటివ్ వృద్ధిని గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే వరుసగా 4.9%, 4.0%, 3.1% మేర పెరిగాయి. కాగా మన్నికైన వినియోగదారు వస్తువులు, మన్నికలేని వినియోగదారు వస్తువుల విషయంలో 4.3%, (-)2.6 శాతం వృద్ధి నమోదు అయింది.