Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ అధికారులు కొందరు సోమవారం (జులై 16) నుంచి ఆరు రోజుల పాటు సమ్మె చేసేందుకు సిద్ధమ య్యారు. ఐడీబీఐ బ్యాంక్ అస్థిత్తాన్ని ప్రమాదంలో పడేస్తూ బ్యాంక్లో కీలకమైన 51 శాతం వాటాను జీవిత బీమా సంస్థకు (ఎల్ఐసీ) అప్పగించాలని సర్కారు యత్నిస్తుండడంతో పాటు పాటు 2012 నవంబరు నుంచి తమ వేతనాల సవరణ జరగనందుకు నిరసనగా కొందరు అధికారులు సమ్మె చేసేందుకు సిద్ధమవుతున్నారని బ్యాంక్ వర్గాలు ఒక ప్రకటనలో సమాచారం ఇచ్చాయి. వేతన సవరణ విషయంలో గత ఏడాది ఒకసారి సమ్మె నోటీసు ఇచ్చినా మేనేజ్మెంట్ ఇచ్చిన హామీతో వీరు విరమించుకున్నారు. ఐడీబీఐ బ్యాంక్లో 51 శాతం వాటాను ఎల్ఐసీకి విక్రయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు 'ఆల్ ఇండియా ఐడీబీఐ ఆఫీసర్స్ అసోసియేషన్' ఇప్పటికే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి తాజాగా మరో వినతిపత్రం అందించింది.