Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీఏఐ సదస్సులో మెజార్టీ సీఏల అభిప్రాయం
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశ వ్యాప్తంగా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన 'వస్తుసేవల పన్ను' (జీఎస్టీ) విషయంలో మరింత అధ్యయనం జరగాల్సి అవసరం ఎంతైనా ఉందని చార్టర్డ్ అకౌంటెట్లు అభిప్రాయపడ్డారు. జీఎస్టీ అమలులోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా 'ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెట్స్ ఆఫ్ ఇండియా' (ఐసీఏఐ) శుక్రవారం హైదరాబాద్లో 'వన్ ఇయర్ ఆఫ్ జీఎస్టీ- లెర్నింగ్, అన్లెర్నింగ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్' అన్న అంశంపై ఒక్క రోజు సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి దాదాపు 300 మందికి పైగా చార్టర్డ్ అకౌంటెట్లు, సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్సీ చైర్మెన్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు, హైదరాబాద్ బ్రాంచ్ చైర్మెన్ సునీల్ కుమార్ మండవ, వరంగల్ బ్రాంచ్ చైర్మెన్ చంచల్ అగర్వాల్, హైదరాబాద్ బ్రాంచ్ సెక్రెటరీ వెంకట్రామ్ తదితరలు ఈ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. సదస్సులో వక్తలు మాట్లాడుతూ జీఎస్టీ అనేక పన్ను సంస్కరణలు తీసుకువచ్చినప్పటికీ ఇందులో అనేక సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. వ్యాపారులు ప్రజల నుంచి పన్ను వసూలు చేస్తున్నప్పటికీ ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయడం లేదని.. పన్ను రాబడిలో లీకేజీలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని వక్తలు కోరారు.