Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశీయ కరెన్సీ చరిత్రలోనే తొలిసారిగా రూపాయి జీవన కాల కనిష్టానికి పడిపోతున్న నేపథ్యంలో రూపాయి పతనంపై కేంద్రమంత్రి అరుణ్జైట్లీ స్పందించారు. కరెన్సీ మార్కెట్లో ఎలాంటి అస్థిరత ఎదురైనా ఎదుర్కొనేందుకు సర్కారు సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. అస్థిరతను ఎదుర్కొనేందుకు దేశంలో సరిపోయే విదేశీ మారక నిల్వలలు భారత్ వద్ద ఉన్నాయని మంత్రి తెలిపారు. కరెన్సీ మార్కెట్లో పరిణామాలను తాము ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఆయన వివరించారు. టర్కీ కరెన్సీ లీరా ప్రభావంతో విదేశీ మార్కెట్లపై ప్రభావం పడిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ మంగళవారం రూ.70.09 స్థాయికి పడిపోయింది. రూపాయికిదే జీవన కాల కనిష్టం కావడం గమనార్హం. రూపాయితో పాటు వివిధ దేశాల కరెన్సీ విలువ కూడా భారీగా పతనమయ్యాయి. ఈ నేపథ్యంలో జైట్లీ ట్విటర్ వేదికగా బుధవారం స్పందించారు.