Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదారబాద్: దంత వైద్యులకు ఉత్పత్తులు అందించే ఇ-కామర్స్ పోర్టల్ 'మై డెంటిస్ట్ ఛాయిస్' 2020 నాటికి రూ.50-100 కోట్ల రెవెన్యూకు చేరుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు, సీఈవో శివ్ ప్రసాద్ పిన్నాపురాల తెలిపారు. గురువారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయంగా విస్తరించేందుకు రెండో దశలో దాదాపు 5 లక్షల అమెరికా డాలర్ల ఫండింగ్ను సమీకరించామన్నారు. గడిచిన నాలుగేండ్ల కాలంలో 100కు పైగా బ్రాండ్లకు చెందిన 10,000 దంత ఉత్పత్తులను డాక్టర్లకు సరఫరా చేశామన్నారు. లాభదాయకతను పెంచుకోవడానికి కంపెనీ సొంత బ్రాండ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలోనే తాము తొమ్మిది కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలోనే ఉత్తర అమెరికాలో కార్యాలయాన్ని తెరువనున్నామని తెలిపారు.