Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి కొత్తగా దాదాపు 100 శాఖలను తెరవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1391 శాఖలను కలిగి ఉన్నామని.. మార్చి ముగింపు నాటికి వీటి సంఖ్యను దాదాపు 1500 శాఖలకు విస్తరించాలని లక్ష్యాంగా పెట్టుకున్నట్టుగా బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పునీత్ కపూర్ తెలిపారు. గురువారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జీరో బ్యాలెన్స్తో సేవింగ్ ఖాతాను తెరుచుకొనేందుకు గాను అందుబాటులోకి తెచ్చిన 'కోటక్ 811' సేవింగ్ ఖాతాల పథకానికి అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని ఆయన అన్నారు. కేవలం బయోమెట్రిక్ ఆధారంగానే క్షణాల్లో ఈ ఖాతాను తెరిచే వీలుందని ఆయన తెలిపారు. ఖాతాతో పాటు డెబిట్ కార్డును కూడా అందిస్తున్నట్టుగా ఆయన వివరించారు.