Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాలరుతో పోలిస్తే మరింతగా పతనమై దేశీయ కరెన్సీ..
- తాజాగా రూ.70.39 స్థాయికి చేరిక
- కలవరపడుతున్న వ్యాపార వర్గాలు
- మరికొంత కాలం ఇవే పరిస్థితులు..
- త్వరలో ధరలు పెరిగే అవకాశం
- అన్ని వర్గాల ప్రజల్లోనూ ఆందోళన
ముంబయి: రూపాయి విలువ అంతకంతకు క్షీణిస్తోంది. గురువారం ట్రేడింగ్లో తాజాగా రూపీ మరింతగా కుంగి రూ.70.32ల స్థాయికి క్షీణించింది. ఇది రూపాయి జీవన కాల కనిష్టం కావడం గమనార్హం. మంగళవారం రూపాయి ఒక దశలో రూ.70.08కి పతనమైన సంగతి తెలిసిందే. కానీ.. ట్రేడింగ్ ముగింపులో మాత్రం 4పైసలు లాభపడి రూ.69.89వద్ద ముగిసింది. బుధవారం స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫారెక్స్ మార్కెట్లు పని చేయలేదు. తిరిగి గురువారం మార్కెట్లు ప్రారంభం కాగానే రూపాయి పతనపు బాట పట్టింది. టర్కీలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆ దేశ కరెన్సీ టర్కీష్ లిరా భారీగా పతనమవుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రభావం మన రూపాయిపై కూడా కనిపిస్తోంది. కేవలం భారత కరెన్సీపైనే కాకుండా మొత్తం ఆసియా దేశాల కరెన్సీపై దీని ప్రభావం ఉంది. ఇంటర్బ్యాంక్ ఫారెన్ ఎక్స్ఛేంజీలో గురువారం రూపాయి డాలరుతో పోలిస్తే రూ.70.25 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. అంతకు ముందు సెషన్లో రూపాయి రూ.69.89 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం మరో 43పైసలు బలహీన పడి రూ.70.32కు చేరింది. లీరా పతనం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో దిగుమతి దారుల నుంచి అమెరికన్ కరెన్సీ డాలరుకు డిమాండ్ బాగా పెరిగిందని ఫారెక్స్ ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు. వాణిజ్య లోటు అయిదేండ్ల గరిష్టాన్ని తాకి 18బిలియన్ డాలర్లకు చేరిందని మంగళవారం వాణిజ్య మంత్రి వెల్లడించడంతో ఆ ప్రభావం కూడా రూపాయి కనబడుతోంది. మంగళవారం ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (ఎఫ్ఐఐఎస్) దాదాపు రూ.378.84కోట్ల విలువైన షేర్లను అమ్మేసినట్లు సమాచారం.టర్కీ రాజకీయ, ఆర్థిక సంక్షోభం. ఈ సంక్షోభం ప్రపంచ మార్కెట్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రపంచ కరెన్సీలు, దేశీయ కరెన్సీ పాతాళంలోకి పడిపోతుండటంతో డాలర్ విలువ పైపైకి 13 నెలల గరిష్టంలోకి ఎగిసింది. టర్కీ కరెన్సీ లీరా కోలుకుని గ్లోబల్ మార్కెట్లు స్థిరత్వానికి వచ్చినప్పుడే రూపాయి విలువ కోలుకుంటుందని ఆనంద్ సేథి షేర్, స్టాక్ బ్రోకర్స్, రీసెర్చ్ విశ్లేషకుడు రుషబ్ మరు తెలిపారు.
భగ్గుమననున్న ధరలు..
దేశీయ కరెన్సీ రికార్డు కనిష్టానికి పడిపోవడంతో ఆర్థిక వ్యవస్థలోని వివిధ వర్గాల్లో కలవరం మొదలైంది. కంపెనీలు, ఎగుమతిదారులు, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న విద్యార్థులు, విదేశీయానానికి ప్లాన్ చేస్తున్న వారు ఇలా.. అందరిలోనూ రూపాయి పతనం కలవరపెడుతోంది. ముఖ్యంగా దేశీయ ఆర్థిక వ్యవస్థకు దిగుమతులు మరింత భారంగా మారునున్నాయి. భారత్ అత్యధికంగా ఎగుమతులపై ఆధారపడుతుందన్నది కాదనలేని సత్యం. ముడి చమురు నుంచి మొదలుకొని ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వరకు బంగారం, వంట నూనెలు, పప్పు దినసులు ఇలా చాలా నిత్యవసర వస్తు వులను భారత్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. గత ఏడాది దేశం మొత్తం 565 బిలియన్ డాలర్ల మేర దిగుమతులు చేసుకోగా.. ఈ ఏడాది రూపాయి విలువ పతనంతో దిగుమతుల బిల్లు ఈ ఏడాది 600 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఏడాది రూపాయి ఇప్పటికే 9.3 శాతం మేర పడిపోయింది. ఈ పరిస్థితి మరికొంత కా లం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దిగుమతి ఆధారిత వస్తువుల ధరలు భారీగానే పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి కే జులై నెల వరకు దేశంలో వరుసగా గత తొమ్మిది నెలల నుంచి ధరలు పెరు గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో మరోసారి ధరల మంట రాజుకో నుందన్నది కాదనలేని సత్యం. ప్రధానంగా చమురు దిగుమతుల బిల్లు పెరగ నుండడంతో ఈ ప్రభావం అన్ని రంగాల ఉత్పత్తలపై స్పష్టంగా కనిపించనుంది. దీనికి తోడు వంట నూనెలు, ఆహార పదార్ధాలు, పప్పుదినసులతో పాటు మొబైల్స్, గ్యాడ్జెట్స్ వంటి వస్తువుల ధరలు పెరగనున్నాయి.