Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమ్మకాల ఒత్తిడితో కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్లు
- 505 పాయింట్లు పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం మదుపరులతో కనీళ్లు పెట్టించాయి. అమెరికా కరెన్సీ డాలరుతో రుపాయి మళ్లీ పడిపోవడం, వాణిజ్య యుద్ధ మేఘాల ప్రభావంతో దేశీయ మార్కెట్లు నష్టాలోకి జారుకున్నాయి. చైనా ఉత్పత్తులపై అమెరికా మరిన్ని ఆంక్షలు ప్రవేశపెట్టనుందన్న విశ్లేషణలు మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. విదేశీ సంస్థాగత నిధులు తరలించుకుపోవడం తదితర పరిణామాల మధ్య మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలోనే బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 505.15 పాయింట్లు (1.33 శాతం) కోల్పోయి 37,585.51కి పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 137.45 పాయింట్లు (1.19 శాతం) నష్టపోయి 11,377.75 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్లో 26 స్టాక్స్ ప్రతికూలతను ఎదుర్కోగా, 14 స్టాక్స్ లాభపడ్డాయి. సన్ఫార్మా 2.75 శాతం, టాటా మోటార్స్ 2.50 శాతం, హెచ్డీఎఫ్సీ 2.38 శాతం, రిలయన్స్ 2.30 శాతం చొప్పున అధికంగా నష్టపోయిన వాటిలో టాప్లో ఉన్నాయి.
155 లక్షల కోట్లకు జారిన ఎంక్యాప్..
అంతకు ముం దు రెండు సెషన్లలో భారీ లాభాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు సోమవారం అనూ హ్యంగా నష్టాలోకి జారుకోవడంతో కంపెనీ మార్కెట్ విలువ కదేలైంది. బీఎస్ఈలో నమోదైన స్టాక్స్ మొత్తం విలువ దాదాపు రూ.1.15 లక్షల కోట్ల మేర కుంగి.. రూ.155 లక్షల కోట్లకు చేరుకుంది. బీఎస్ఈలో మొత్తం 1441 స్టాక్స్ నష్టాల్లోకి జారుకోగా.. 1,282 స్టాక్స్ లాభాల బాట పట్టాయి. 191 స్టాక్స్లో ఎలాంటి చలనం కనిపించలేదు. నష్టాల నేపథ్యంలోనే దాదాపు 140 స్టాక్స్ సోమవారం 52 వారాల గరిష్టాన్ని తాకడం విశేషం.