Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాణిజ్య సుంకాలు పెంచిన ట్రంప్
- ప్రతీకార చర్యలు తప్పవు: చైనా
వాషింగ్టన్: ప్రపంచ వాణిజ్య సమాజం భయపడిందే జరిగింది. వాణిజ్య యుద్ధంలో భాగంగా అగ్రరాజ్యం అమెరికా చైనాపై మరోసారి పంజా విసిరింది. చైనా దిగుమతులపై మరిన్ని సుంకాలను విధిస్తామని గత కొన్ని రోజులుగా హెచ్చరిస్తూ వస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా ఈ దిశగా అధికారిక ప్రకటన చేశారు. మరో 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది అమెరికా వినియోగదారులకే అతిపెద్ద షాక్గా మారనుంది చైనీస్ సంస్థల నుంచి అమెరికన్లను కొనుగోలు చేసే మొత్తం 505 బిలియన్ ఉత్పత్తుల్లో సగానికి పైగా ఉత్పత్తులు కొత్త టారిఫ్ లెవీలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. జూలైలో మొదటిసారి ట్రంప్ టారిఫ్ వార్కు తెర తీసిన సంగతి తెలిసిందే. అప్పుడు 50 బిలియన్ డాలర్ల ఇండిస్టియల్ గూడ్స్పై టారిఫ్లు విధించారు. తొలి వాణిజ్యయుద్ధం మాదిరిగా కాకుండా... సోమవారం ప్రకటించిన ఉత్ప త్తుల్లో ఎక్కు వగాని యోగ దారు ల ఉత్ప త్తు లు ఎయిర్ కండీష నర్లు, స్పార్క్ ప్లగ్స్, ఫర్నీ చర్, ల్యాంప్స్ వం టివి ఉన్నాయి. సెప్టెంబర్ 24 నుంచి ప్రభావిత వస్తువులకు అమెరికా దిగుమతిదారులు అదనంగా 10 శాతం టారిఫ్లను చెల్లించాల్సి ఉంటుంది. 'భవిష్యత్లో చైనా మా రైతులు, ఇతర పరిశ్రమలపై ప్రతీకార చర్యలకు దిగితే మేం వెంటనే మూడో దశ సుంకాల అమలు చేపడతాం. మరో 267 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై టారిఫ్లు విధిస్తాం' అని ట్రంప్ ఈ సందర్భంగా హెచ్చరించారు. అయితే సుంకాలపై చైనా దీటుగా స్పందించింది. అమెరికాపై ప్రతికార చర్యలు తప్పవంటూ హెచ్చరించింది.