Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆంధ్రాబ్యాంక్ పగ్గాలు పకిరిసామికి
న్యూఢిల్లీ: ఉన్నతాధికారుల కొరతతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రభుత్వ బ్యాంకులకు ఎట్టకేలకు ప్రభుత్వ కొత్త బాస్లను నియమించింది. పది ప్రభుత్వ రంగ బ్యాంకులకు అధినేతలను నియమిస్తూ సర్కారు తాజాగా ఆదేశాలను జారీ చేసింది. ప్రధాని నేతృత్వంలోని నియామకాల క్యాబినెట్ కమిటీ కొత్త బాస్ల ఈ ఎంపికకు ఆమోదం తెలిపింది. ఎస్బీఐలో డిప్యూటీ జనరల్ మేనేజర్లుగా విధులు నిర్వహిస్తున్న అయిదుగురు అధికారులకు వివిధ బ్యాంకుల ఎండీ, సీఎండీ పదవులు లభించాయి.
ఎస్బీఐకి చెందిన పల్లవి మల్హోత్రాను సెంట్ర్ బ్యాంక్ చీఫ్గాను, కె.పకిరిసామిని ఆంధ్రాబ్యాంక్ అధినేతగాను ప్రభుత్వ ప్రకటించింది. మృత్యుంజయ మహాపాత్రాకు సిండికేట్ బ్యాంక్ పగ్గాలను, పద్మజా చౌదరీకి ఇండియన్ బ్యాంక్ అధికారలను సర్కారు అప్పగించింది. విలీన ప్రతిపాదనలో ఉన్న దేనా బ్యాంక్కు సర్కారు కరణం శేఖర్ను ఎండీ, సీఈవోగా నియమించడం విశేషం. ఇండియన్ బ్యాంక్కు చెందిన ఈడీ ఎ.ఎస్.రాజీవ్ను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సీఎండీగాను, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీగా ఉన్న అశోక్ కుమార్ను ఆదే బ్యాంక్ సీఎండీగా ప్రభుత్వం ఎంపిక చేసింది. సిండికేట్ బ్యాంక్కు చెందిన ఎస్.ఎస్.మల్లికార్జున్రావుకు అలహాబాద్ బ్యాంక్ సీఎండీగాను, యూనియన్ బ్యాంక్ ఈడీ అతుల్ కుమార్ గోయెల్ను యూకో బ్యాంక్ ఎండీ, సీఈవోగాను, అలహాబాద్ బ్యాంక్ ఈడీ ఎస్.హరిశంకర్ను పంజాబ్, సింధ్ బ్యాంక్ సీఎండీగా సర్కారు నియమించింది.
దీనికి తోడు సర్కారు గురువారం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థలకు 14 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లును నియమిస్తూ ప్రభుత్వం గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకుల్లో ఉన్నత పదవులకు నియామకాలు చేపట్టే 'బ్యాంక్స్ బోర్డు బ్యూరో' జూన్ 16న చేసిన సిఫారసుల మేరకు ఈ నియమాకాలు చేపడుతున్నట్టుగా ప్రభుత్వం తన తాజా ఉత్తర్వులలో పేర్కొంది.