Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా సరికొత్త కాంపాక్ట్ సెడాన్ కారు టిగోర్ను మార్కెట్లోకి కొత్త లుక్లో రీలాంచ్ చేసింది. దసరా, దీపావళి పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకొని కొత్త టిగోర్ను లాంచ్ చేసినట్టుగా సంస్థ తెలిపింది. రూపం, సదుపాయాలు, ఆకృతుల్లో పలు మార్పులు చేసి స్టయిలిష్ లుక్లో కొత్త టిగోర్ను విడుదల చేశారు. 15 అంగుళాల డ్యుయల్ టోన్ అలారు వీల్స్, క్రిస్టల్ ఎ ల్ఈడీ టెయిల్ ల్యాంప్స్తోపాటు, ఇంటీరియర్లో అత్యాధునిక సదుపాయాలను ఏర్పాటు చేశారు . ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 7-అంగుళాల ఇన్పోటేన్మెంట్ టచ్ స్క్రీన్ విత్, 4 స్పీకర్లు, 4 ట్వీటర్స్ ఈ కారు ఇంటీరియర్లోని ప్రత్యేకత. ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఆరు రంగుల్లో లభించనుంది. పెట్రోల్ వెర్షన్ కార్ల ధరను కంపెనీ రూ.5.20-6.65 లక్షల రూపాయిలు మధ్య నిర్ణయించింది. డీజిల్ వెర్షన్ కార్ల ధరలను కంపెనీ రూ.6.09 -7.38గా (ఎక్స్షోరూమ్, న్యూఢిల్లీ) ప్రకటించింది.