Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకే రోజు 3 లక్షల కోట్లకు పైగా లాభం!
- అనూహ్యంగా లాభాల్లోకి దూసుకుపోయిన సూచీలు
- కలిసొచ్చిన దేశీయ పరిణామాలు, ముడి చమురు ధరలు
- ఆద్యంతం లాభాల్లోనే కదలాడిన దేశీయ స్టాక్స్
ముంబయి: ప్రతికూలతలు ఆవహించి ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఒక్కసారిగా లాభాల్లో మెరిశాయి. వరస పతనాలతో తక్కువ ధరల వద్ద స్టాక్స్ అందుబాటులోకి రావడం, మదుపరులు షార్ట్ కవరింగ్కు దిగడం, రూపాయి బలపడడం, ముడి చమురు ధరలు దిగి రావడం, ఆటో, లోహ, బ్యాంకింగ్ తదితర రంగాల షేర్లలో అనూహ్య అమ్మకాలు నమోదు కావడంతో స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల బాట పట్టాయి. వ్యవస్థలో సరిపడా నగదు ఉంచే క్రమంలో భాగంగా గురువారం (11న) ప్రభుత్వ బాండ్లను కొనుగోలుతో మరో రూ.12వేల కోట్ల నిధులు వ్యవస్థలోకి అందబాటులోకి తేనున్నట్టుగా ఆర్బీఐ చేసిన ప్రకటన మార్కెట్లను మురిపించింది. దీంతో మార్కెట్లు పరుగులు పెట్టాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్ వంద పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభం కాగా, నిఫ్టీ 10,300పైన ట్రేడయ్యింది. ఆద్యంతం లాభాల్లో కొనసాగిన సూచీలు ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాలను ఆర్జించాయి. సెన్సెక్స్ 461.42 పాయింట్ల లాభంతో 34760.89 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 159.05 పాయింట్ల లాభంతో 10,460.10 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.17 వద్ద ట్రేడయింది. ఫలితంగా బుధవారం ఒక్కరోజే మదుపరుల సంపద దాదాపు రూ.3 లక్షల కోట్ల మేర పెరిగింది. ఎన్ఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్, ఐషర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంకు, జీ ఎంటర్టైన్ తదితర కంపెనీలు లాభపడ్డాయి. భారతీ ఇన్ఫ్రాటెల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్ టెక్ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్లో కేవలం నాలుగు స్టాక్స్ తప్ప మిగతా 27 స్టాక్స్ లాభాల్లోనే నడిచాయి.
పరుగుకు ప్రధాన కారణాలివే..
ొఅనూహ్య భయాల కారణంగా నమోదైన అమ్మకాలతో మార్కెట్లు ఇప్పటికే టెక్నికల్ అంచాలను మించి కుంగాయి. నిఫ్టీ 10,200 దరిదాపుల్లోకి చేరడం మార్కెట్ వర్గాలును ఊరించింది. దీంతో మదుపరులు షార్ట్కవరింగ్కు దిగారు. దీంతో నిఫ్టీ తదుపరి హర్డిల్ రేంజ్ 10,500-10,650 పాయింట్ల దిశగా పరుగులు పెట్టింది.
ొఈ ఏడాది ఇప్పటికే 14 శాతం వరకు పతనమైన దేశీయ కరెన్సీ రూపాయి మారకపు విలువ బుధవారం కోలుకుంది. మంగళవారం మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో రూ.74.39 స్థాయి వద్ద ఉన్న రూపాయి విలువ బుధవారం దాదాపు 26 పైసల మేర పుంజుకొని రూ.74.11 స్థాయికి చేరింది.
ొవ్యవస్థలో లిక్విడిటీ సమస్య తలెత్తకుండా ఉండేందుకు గాను బహిరంగా మార్కెట్ లావాదేవీల (వోఎంవో)ద్వారా వ్యవస్థలోకి కొత్త రూ.12000 కోట్ల నగదును అందుబాటులోకి తేనున్నట్టుగా ఆర్బీఐ ప్రకటించడం కూడా మార్కెట్లకు జోష్ను ఇచ్చింది.
ొఐఎంఎఫ్ ప్రపంచ వృద్ధి రేటు గురించి మంగళవారం చేసిన కీలక వ్యాక్యల నేపథ్యంలో బ్రెంట్ ఫూచర్స్లో ముడి చమురు ధర 85 డాలర్లకు దిగువన ట్రేడ్ అయింది. మంగళవారం ధరతో పోలిస్తే పీపా ముడిచమురు ధరలు బుధవారం దాదాపు 21 సెంట్లమేర కుంగి 84.79 డాలర్లుగా నమోదు అయింది.
ొవిదేశీ పోర్టుఫోలియో ఇన్వెష్టర్లు (ఎఫ్పీఐ) అత్యధికంగా మన మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు గాను సెబీ సరళీకరణ విధానాలను అన్వేషిస్తోందన్న వార్తల నేపథ్యంలో మదుపరుల సెంటిమెంట్ పెరిగింది. దీనికి తోడు బుధవారం ఎఫ్ఐఐల విక్రయాలు కూడా కొంత శాతించాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్ల సెంటిమెంట్ పెరిగింది.