Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: పెరుగుతున్న అప్పులు.. వ్యాపారంలో నష్టాలతో విమానయాన సంస్థలు గత కొన్నేళ్లుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొం టున్నాయి. దానికి తోడు పెరుగుతున్న ఇంధన ధరలు కూడా విమానయాన సంస్థలకు గుదిబండగా మారాయి. ఈ నేపథ్యంలో విమాన ఇంధన ధరలపై ఎక్సైస్ సుంకాన్ని 14శాతం నుంచి 11శాతానికి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో కిలో లీటరు విమాన ఇంధనం ధర రూ.74,567గా పలుకుతోంది. అంటే లీటరు విమాన ఇంధనం ధర రూ.74.56 మాత్రమే.. ముంబైలో ఇది రూ.74,177గా ఉంది. దీంతో ప్రస్తుతం దేశంలో వింత పరిస్థితి కనిపిస్తోంది. సాధరణ ప్రజలు వాడే పెట్రోలు ధరేమో లీటరుకు రూ.90 దాటి పరుగులు పెడుతుంటే.. సంపన్నులు ప్రయాణించే విమానాల్లో వాడే విమాన ఇంధనం ధరేమో తగ్గి రూ.74.56గా పలుకుతోంది. డబ్బులున్న బడా బాబులు ఎంత ధర పెట్టైనా విమానయానం చేస్తారు.. ఈ నేపథ్యంలో సర్కారు విమాన సంస్థలను ఆదుకొనే నెపంతో బడా బాబులకు మేలు చేస్తూ.. సామాన్యుల నడ్డి విరుస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.