Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరుస పతనాలలో ప్రపంచ మార్కెట్లు..
- కరిగిపోతున్న దేశాల కరెన్సీ విలువలు..
- స్థాయి మించి అప్పుల్లో ప్రపంచ దేశాలు
- 'వడ్డీ' తగ్గడంతో విఫరీతంగా రుణాలు
- జాడలేని ఆర్థిక నిర్మాణాత్మక చర్యలు..
- ప్రేక్షక పాత్రలో నియంత్రణ సంస్థలు
- అమెరికా అనాలోచిత చర్యలతో తిప్పలు
- ప్రపంచ 'ఆర్థిక వ్యవస్థ'లు..
- మేలుకోకపోతే త్వరలోనే మరో 'క్రై'సిస్!
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా కుప్పకూలుతూ వస్తున్నాయి.. గత కొంతకాలంగా అమెరికాతో సహా వివిధ అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతొన్న దేశాల స్టాక్ మార్కెట్లు అనూహ్యంగా నష్టాల్లోకి జారుకుంటున్నాయి.. మరోవైపు యూఎస్-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం అంతం కంతకు పెరుగు తుండడంతో ప్రపంచ వాణిజ్య దెబ్బతిం టోంది.. దీంతో ఆసియాతో పాటు ఆస్ట్రేలియా, ఐరోపా సమాజంలోని వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు గణనీయంగా ప్రభావితమవుతున్నాయి.. ఇంకోవైపు అమెరికా కేంద్ర బ్యాంక్ వడ్డీరేట్లను క్రమంగా పెంచుతూపోతోంది. దీంతో ప్రపంచ మార్కెట్ల నుంచి నిధులు అమెరికా దారి పడు తున్నాయి. ఫలితంగా విశ్వవ్యాప్తంగా డాలరు బలప డుతోంది.. ఇదే సమయంలో ఇతర దేశాల దేశాల కరెన్సీ విలువ గణనీయంగా పడిపోతోంది. ఇదిలా ఉంటే వివిధ దేశాలు తమ స్థాయికి మించి ప్రమాదకర స్థాయిలో అప్పులు చేస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థను చుక్కానిలా నిలవాల్సిన కేంద్ర బ్యాంకులు ఆయా దేశాల పాలకుల స్వార్థానికిలోబడి వారి చేతుల్లో పావులుగా మారి తమ గురుతర బాధ్యతను నిర్వర్తించలేకపోతున్నాయి.. ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోనే కొట్టుమిట్టాడుతోంది.. ఇదే పరిస్థితులు కొనసాగితే అనతి కాలంలోనే 'వరల్డ్ ఎకానమి' మరో పెను సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉంద ని అంతర్జాతీయ ద్రవ్య నిధితో (ఐఎంఎఫ్) పాటు పలు ఆర్థిక విశ్లేషణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
నవతెలంగాణ, వాణిజ్య విభాగం
2008..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి జారుకొని సరిగ్గా దశాబ్ద కాలం కావొస్తోంది. అనూహ్యంగా అమెరికాలోని 'లేమాన్ బ్రదర్స్' పతనంతో మొదలైన ఆర్థిక సంక్షోభం అప్పట్లో దావానంలా వ్యాపించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కుదేలు చేసింది. ఆయా దేశాల్లో ఆస్తుల విలువ పడిపో యాయి. పారిశ్రామిక రంగంలో తీవ్ర అలజడి నెలకొంది. ఐటీ పరిశ్రమ కుప్పకూలింది. ప్రపంచ వాణిజ్యం కనిష్టా స్థాయులకు పడిపోయింది. ఉత్పత్తి కార్యకలాపాలు స్తంభిం చాయి. ఈ పరిణామాలతో ప్రపంచం వణికిపోయింది. ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్న మన దేశంపై కూడా ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఛాయలు పడి చిగురుటాకులా వణికింది. దేశీయంగాను వాణిజ్య కార్యకలాపాలు స్తంభిం చాయి, ఐటీ పరిశ్రమలకు ఆర్డర్లు కరువయ్యాయి, ఉత్పత్తి కార్యకాలాపాలకు విఘాతం కలిగి చాలా పరిశ్రమలు మూత పడ్డాయి, అసంఘటిత రంగంలో లక్షలాది ఉద్యోగాలు గాలితో కలిసిపోయాయి.
గుణపాఠం నేర్వని ప్రపంచం..
ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొని దశాబ్ద కాలం పూర్తికావొస్తున్నప్పటికీ ఇక క్షేత్రస్థాయిలో సంక్షోభపు ఛాయలు పూర్తిగా తొలగని పరిస్థితులు కనిపిస్తున్నాయి. సరిగ్గా ఇదే విషయాన్ని ఉటంకిస్తూ ఐఎంఎఫ్ తాజాగా మరో హెచ్చరిక చేస్తోంది. ప్రపంచ ఆర్థికం భయంకరమైన 2008 నాటి సంక్షోభం నుంచి పూర్తి స్థాయిలో పాఠాలు నేర్చుకోలేదన్నది ఐఎంఎఫ్ అభిప్రాయం.. సంక్షోభం నుంచి అప్పటికప్పుడు బయటపడేందుకు ఆయా దేశాలు తాత్కాలిక చర్యలు చేపట్టినప్పటికీ.. వాటా మూలాలను బలోపేతం చేసుకోలేదన్నది ఐఎంఎఫ్ ఆర్థికవేత్తల విశ్లేషణ. దీంతో ఆనాటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అయిన గాయాలు పెరుగు తూనే వస్తున్నాయని.. త్వరలోనే ఇవి మరింతగా తిరగబెట్టి ప్రపంచ ఆర్థికవ్యవస్థను మరోమారు సంక్షోభంలోకి తోసేసే ప్రమాదం ఉందని ఐఎంఎఫ్తో సహా పలువురు ప్రముఖ ఆర్థిక వేత్తలు తాజాగా హెచ్చరిస్తున్నారు. గార్డియన్ పత్రిక వెల్లడించింది.
ఇప్పటికైనా మేలుకోవాలి..
సంక్షోభం నేపథ్యంలో ఎంతో వివేకంతో వ్యవహరించి చాలా తక్కువ కాలంలోనే ఆయా దేశాలు కోలుకున్నప్పటికీ.. పరిస్థితులు కాస్త కుదురుకోగానే అసలు విషయాన్ని మరిచి పోయాయని ఐఎంఎఫ్ అంటోంది. ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు. నియంత్రణ సంస్థలు తమతమ ఆర్థిక వ్యవస్థలను కాపాడుకొనే దిశగా తగిన సంస్కరణలు, రక్షణా త్మక చర్యలు చేపట్టడం లేదన్నది.. ఐఎంఎఫ్ ప్రధాన ఆందో ళన. దీంతో ఎప్పుడైన మేటి ఆర్థిక వ్యవస్థల్లో సంక్షోభం బుడగ పగిలి.. విషం చిమ్మే అవకాశం ఉందని ఐఎంఎఫ్ చెబుతోంది. 2008 సంక్షోభం నేపథ్యంలో బ్యాంకుల్లో నిల్వ లను పెంచేందుకు ఆయా దేశాలు పలు చర్యలు చేపట్టాయి. ఇదే సమయంలో ఆయా దేశాలు వడ్డీరేట్లను క్రమంగా తగ్గిస్తూ వచ్చాయి. దీంతో ప్రపంచ దేశాలు అత్యధికంగా అప్పులు చేయడం మొద లుపెట్టాయి. తీసుకుంటున్న అప్పులను నిర్మాణాత్మక ఫలితాల కోసం సంపద పంపినీ పనుల కోసం ఖర్చు చేయా లన్న ఆలోచన లేకుండా ప్రభు త్వాలు పని చేస్తున్నాయి. ప్రభుత్వాలతో పాటు బడా సంస్థలు గణనీయమైన రీతిలో అప్పులు చేసినట్టుగా ఐఎం ఎఫ్ తన తాజా అవుటలుక్లో తెలిపింది. ప్రస్తుతం పరిస్థితి ఏ దశకు చేరిందంటే ఆయా దేశాల అప్పు జీడీపీలో 60 శాతం వరకు చేరుకున్నాయి. రుణాల విషయంలో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందు తున్న దేశాలు నేల విడిచి సాము చేస్తున్నా యని ఐఎంఎఫ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2008లో సంక్షోభం నాటికి రుణం-జీడీపీ నిష్పత్తిని పరిశీ లిస్తే ఇది ఎంతో ఎక్కవని ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. 2008లో ఆర్థిక సంక్షోభానికి ముందు ఈ నిష్పత్తి 36 శాతం గా ఉంటే.. సంక్షోభ సమయంలో ఇది 52 శాతానికి చేరుకు న్నట్టుగా తెలిపింది. స్థాయికి మించి అప్పులు చేయడంతో పాటు తద్వారా సమీకరించిన మొత్తాల్లో అధిక భాగాన్ని ఆయా దేశాలు నిర్మాణాత్మక కార్యక్రమాలకు, మౌలిక వసుతుల కల్పనలపై ఖర్చు చేయకుండా ఇతర రంగాలకు మళ్లించడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగిస్తోంది. ఇదే తరహా పరిస్థితి కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు త్వరలోనే ముప్పు వచ్చే ప్రమాదం ఉందని ఐఎంఎఫ్ చెబుతోంది.
అమెరికాయే అసలు కారణం..
అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం అంతం కంతకు పెరుగుతుండడంతో ప్రపంచ వాణిజ్య దెబ్బతి ంటోంది. ఫలితంగా ఆసియాతో పాటు ఆస్ట్రేలియా, ఐరోపా సమాజంలోని వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు గణనీయంగా ప్రభావితమవుతున్నాయని ఐఎంఎఫ్ తన తాజా నివేదికలో తెలిపింది. అమెరికా వడ్డీరేట్లు పెంచుతుండడంతో ఫలితంగా విశ్వవ్యాప్తంగా డాలరు బలపడుతోంది.. ఇదే సమయంలో ఇతర దేశాల దేశాల కరెన్సీ విలువ గణనీ యంగా పడిపోతోంది. 2008 ఆర్థిక సంక్షోభానికి కారణమె ౖనట్టుగానే త్వరలో ప్రారంభం కానున్న సంక్షోభ పరిస్థితికి కూడా అమెరికాయే కారణంగా నిలువనుందని విశ్లేషకులు చెబుతున్నారు. వడ్డీరేట్ల పెంపు కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెరికా సంపన్నుల పెట్టుబడులు మళ్లీ అగ్రారాజ్యం బాట పడుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రభావం ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లలో కనిపిస్తోంది. ఆయా దేశాల మార్కెట్ల నుంచి ఎఫ్పీఐలు గణనీయంగా నిధులను తరలిస్తున్నారు. ఫలితంగా వివిధ అభివృద్ధి చెందుతోన్న స్టాక్ మార్కెట్లు గత నెలన్నర రోజులుగా తీవ్రంగా నష్టపోతున్నాయి. పెరుగుతున్న నిరర్థక ఆస్తులతో కూడా ప్రమాదం లేకపోలేదన్నది ఆ సంస్థ విశ్లేషణ. ఇవన్ని క్రమంగా బలప డుతూ వస్తోన్న నేపథ్యంలో మరో భారీ ఆర్థిక సంక్షోభం త్వరలోనే ప్రపంచాన్ని పలుకరించనుందన్నది కాదనలేని సత్యం. పాలకులు, నియంత్రణ సంస్థలు త్వరగా కోలుకో కపోతే 2020 నాటికి ప్రపంచం పూర్తి సంక్షోభంలోకి ముని గిపోనున్నదని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థకు చుక్కానిలా నిలవాల్సిన కేంద్ర బ్యాంకులు, నియంత్రణ సంస్థలు ఆయా దేశాల పాలకుల స్వార్థానికిలోనై వారి చేతుల్లో పావులుగా మారుతున్నాయి. తమ గురుతర బాధ్యతను నిర్వర్తించలేకపోతున్నాయి.. ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే మందగమనంలో కొట్టుమిట్టాడుతోంది.. ఇదే పరిస్థితులు కొనసాగితే అనతి కాలంలోనే 'వరల్డ్ ఎకానమి' మరో పెను సంక్షోభంలోకి జారిపోనుంది.