Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: సిండికేట్ బ్యాంక్ 93వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా శనివారం హైదరాబాద్ జోన్ పరిధిలో వివిధ కార్యక్రమాలు కోలాహలంగా జరిగాయి. కార్యక్రమంలో భాగంగా బ్యాంక్ రోటరీ క్లబ్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ జోనల్ మేనేజర్ విజరు కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. దేశంలో అట్టడుగున ఉన్న సామాన్యుడి పరోగాభివృద్ధికి సిండికేట్ బ్యాంక్ చేసిన కృషిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. బ్యాంకు అభివృద్ధికి సిబ్బంది చేస్తున్న సేవలను ఆయన ఈ వేదికపై కొనియాడారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ బ్యాంక్ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆయన సిబ్బందిని కోరారు. కార్యక్రమంలో బ్యాంక్ డీజీఎం అరోర, రీజినల్ మేనేజర్ (హైదరాబాద్-1) రవిశంకర్, రీజినల్ మేనేజర్ (హైదరాబాద్-2) షేక్ నజీర్ అహ్మద్తో పాటు వివిధ శాఖలకు, కార్యాలయాలకు చెందిన బ్రాంచీ మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. రక్తదాన శిబిరంలో బ్యాంక్ సిబ్బందితో పాటు వివిధ శాఖలకు చెందిన బ్యాంక్ ఖాతాదారులు పాల్గొన్నారు. మొత్తం వంద మందికి పైగా ఈ రక్తదాన శిబిరంలో పాలుపంచుకున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభమైన బ్యాంక్ 93వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు పక్షం రోజుల పాటు కొనసాగి ఈ నెల25న ముగియనున్నాయి.