Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: పసిడి ధరలు మరోసారి పెరిగాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధర రూ. 220 పెరిగి రూ. 32,270కి చేరుకుంది. పండుగ సందర్భంగా స్థానిక జ్యూయెలరీవ్యాపారుల కొనుగోళ్లతో డిమాండ్ పెరగడం తోపాటు అంతర్జాతీయ పరిణామాలూ బంగారం ధర పెరగడానికి తోడయ్యాయి. కాగా, కిలో వెండి ధర రూ. 39,600గా నమోదయింది. పండుగ సీజన్ కోసం జ్యూయెలర్ల కొనుగోళ్లు పెరగడంతో బంగారం ధర పెరిగిందని ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు. దీంతోపాటు రూపాయి విలువ పతనం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం విలువ కూడా మరింత ప్రియం కావడం కూడా కారణమేనని వివరిస్తున్నారు.