Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కార్ చేతుల్లోకి పెద్దోళ్ల సమాచారం
- విదేశీ సమన్వయంతో 'స్కాన్'
- ఇప్పటికే పలువురికి నోటీసులు
- కొత్త చట్టం ప్రకారం కఠిన చర్యలు
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ నల్లధనాన్ని వెలికితీసే ప్రక్రియను వేగవంతం చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా భారతీయులు విదేశాల్లో అక్రమంగా దాచిన సొమ్ము, ఆస్తుల వివరాలను ఆరా తీస్తోంది. వీటిపై విచారణ జరిపేందుకు గాను ఐటీ శాఖ కొత్త విధానాన్ని అవలంభించాలని యోచిస్తోంది. ఇప్పటికే వేలాది మంది భారత బడాబాబులు విదేశాల్లో దాచిన సొమ్ములు, ఆస్తులను గురించిన సమాచారం ఆదా యపు పన్ను శాఖ అధికారుల చేతుల్లోకి చేరింది. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) సౌజన్యంతో ఐటీ శాఖ ఈ తరహా విదేశీ ఆర్థిక కార్యక లాపాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిం చింది. వీటికి సంబంధించి విచారణ జరిపి క్రిమినల్ చర్యలు తీసుకొనేందుకు గాను కొత్త 'యాంటీ బ్లాక్మనీ చట్టం-2015'లోని నిబంధనలను వినియోగించుకోవాలని ఐటీ శాఖ యోచిస్తున్నట్టు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఐటీ శాఖ అధికారులు ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో ఉన్న ఆదాయపు పన్ను శాఖల వారి సౌజన్యంతో భారత్కు చెందిన బడా బాబుల అక్రమాస్తులు, నగదు డిపా జిట్ల సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మెన్ సుశీల్ చంద్ర ధ్రువీకరించినప్పటికీ.. దీనిపై మరింత సమాచారాన్ని ఇచ్చేందుకు మాత్రం నిరాకరించారు. విదేశాల్లో నిధులు ఉంచడం, ఆస్తుల కొనుగోలుకు సంబంధిం చిన అంశాలను నియంత్రించేందుకు గాను బలమైన చర్యలు తీసుకోనున్నట్టుగా ఐటీ శాఖ అధికారులు తెలిపారు. ఇలాంటి కేసులకు సంబంధించిన చాలా కేసులలో ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్టుగా ఐటీ అధికారులు తెలిపారు.
చాలా మంది పరపతిగలవారే..
ఐటీ శాఖ విదేశాలలో ఆస్తులను గుర్తించిన వారిలో చాలా మంది ఆర్థికంగా సమాజంలో అత్యు న్నత హోదాల్లో ఉన్నవారు, గొప్ప పరపతి కలిగి వారే ఉన్నట్టుగా ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో వీరిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవడం కొంత కష్టంగా మారుతోందన్నది వారి వివరణ. అయితే కొత్త చట్టంలో కల్పించిన వెసలుబాటు ప్రకారం తాము చర్యలు తీసుకోనున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. గతంలో దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్నులలో చూపని ఆస్తులపై మాత్రమే తమ విచారణ ఉంటుందని ఐటీ శాఖ వెల్లడించింది. కొత్త చట్టం ప్రకారం విదేశాల్లో ఆస్తులు, నగదు నిల్వలకు సంబంధించి బడాబాబులు 120% అపరాధ రుసుముతో పాటు 10 ఏండ్ల వరకు జైలు శిక్షపడే అవకాశం ఉంది.
కొత్తగా 1.25 కోట్ల మందిపై పన్నుపోటు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరు మూడో వారానికి దేశ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 15.7శాతం పెరిగాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) వెల్లడించింది. ఏడాది ప్రాతిపదికన పన్నుల రూపంలో రూ.4.89 లక్షల కోట్ల ఆదాయం ఖజానాకు జమ అయినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 1.25కోట్లమందిని పన్ను పరిధిలోకి తీసుకురావాలని సీబీడీటీ లక్ష్యంగా పెట్టుకుంది.