Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశ పారిశ్రా మికోత్పత్తిలో స్వల్ప వృద్ధి నమోదు అయింది. సెప్టెంబరు మాసంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 4.5 శాతానికి పెరిగింది. ఐఐపి వృద్ధికి ముఖ్యంగా విద్యుత్, గనులు, తయారీ రంగాలు మద్దతునిచ్చాయి. తయారీ రంగం మెరుగ్గా కొనసాగడం, యంత్రపరికరాల అమ్మకాలు సంతృప్తికరంగా ఉండటంతో సెప్టెంబరులో ఐఐపీ వృద్ధి సాధించగలిగిందని ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. మరోవైపు అక్టోబర్లో వినియోగదారు ధరల ఆధారిత (రిటైల్) ద్రవ్యోల్బణం సూచీ 3.31 శాతానికి దిగివచ్చిందని సోమవారం కేంద్ర గణంకాల శాఖ వెల్లడించింది. క్రితం సెప్టెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.69 శాతానికి తగ్గి 10 మాసాల గరిష్ట స్థాయిని చేరింది.