Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: మహీంద్ర అండ్ మహీంద్ర స్కార్పియో మోడల్లో కొత్త వేరియట్ను మార్కెట్లోకి తెచ్చింది. 'స్కార్పియో ఎస్యూవీలో ఎస్9' పేరుతో ఈ సరికొత్త వేరియంట్ను సోమవారం విపణిలోకి విడుదల చేసింది. కీలక ఫీచర్లతో కూడిన ఎస్ 9 ఎస్యూవీ ధరను కంపెనీ రూ.13.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించింది. 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజీన్, 140 హెచ్పీ వద్ద 320 ఎన్ఎం టార్క్, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్, 5.9 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కొత్త వాహనంలో ప్రధాన ఫీచర్లుగా కంపెనీ తెలిపింది. అలాగే స్టీరింగ్ వీల్పై ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్తోపాటు, ఆడియో, క్రూయిస్ కంట్రోల్ బటన్లను అమర్చినట్టుగా కంపెనీ తెలిపింది. కొత్త వాహనం టాటా హెక్సాతో గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాల అంచనా.