Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: హిందుజా గ్రూపు కంపెనీ జీవోసీఎల్ కార్పొరేషన్ (గతంలో గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వ్యవహిరంచబడిన) సంస్థ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జులై-సెప్టెంబరు మధ్య కాలానికి సంస్థ నికర లాభం 18.9 శాతం మేర పెరిగి రూ.3.16 కోట్ల నుంచి రూ.3.75 కోట్లకు చేరుకుంది. కాగా ఇదే సమయంలో సంస్థ అమ్మకాల్లో 13.34 శాతం తగ్గుదల నమోదు అయింది. సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు రూ.23.02 కోట్ల నుంచి రూ.19.95 కోట్లకు కుంగాయి. సెప్టెంబరుతో ముగిసిన మొదటి అర్థ భాగంలో జీవోసీఎల్ కార్పొరేషన్ రూ.266 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో సంస్థ నికర లాభం 5.6% వృద్ధి చెంది రూ.13.93 కోట్లకు చేరుకుంది. న్యూఢిల్లీ: హిందుజా గ్రూపు కంపెనీ జీవోసీఎల్ కార్పొరేషన్ (గతంలో గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వ్యవహిరంచబడిన) సంస్థ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జులై-సెప్టెంబరు మధ్య కాలానికి సంస్థ నికర లాభం 18.9 శాతం మేర పెరిగి రూ.3.16 కోట్ల నుంచి రూ.3.75 కోట్లకు చేరుకుంది. కాగా ఇదే సమయంలో సంస్థ అమ్మకాల్లో 13.34 శాతం తగ్గుదల నమోదు అయింది. సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు రూ.23.02 కోట్ల నుంచి రూ.19.95 కోట్లకు కుంగాయి. సెప్టెంబరుతో ముగిసిన మొదటి అర్థ భాగంలో జీవోసీఎల్ కార్పొరేషన్ రూ.266 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో సంస్థ నికర లాభం 5.6% వృద్ధి చెంది రూ.13.93 కోట్లకు చేరుకుంది.