Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ మార్కెట్లు వారాంతాన లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో పాటు.. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడడం సూచీలకు బాగా కలిసొచ్చింది. ఆరంభంనుంచి లాభాల్లో కొనసాగిన కీలక సూచీలు చివరివరకూ లాభాలను నిలబెట్టుకున్నాయి. ఐటీ, ఫార్మా, మౌలిక, విద్యుత్ రంగాల షేర్లు లాభపడడంతో మార్కెట్లు లాభాల బాటపట్టాయి. లోహ రంగ షేర్లు మాత్రం ఒత్తిడికి గురయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 138 పాయింట్ల లాభంతో ప్రారంభం కాగా, నిఫ్టీ 10,650 పాయింట్ల పైన ట్రేడింగ్ ప్రారంభించింది. చివరకు సెన్సెక్స్ 196.62 పాయింట్ల లాభపడి 35457.16పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 65.5 పాయింట్ల లాభంతో 10682.20పాయింట్లకు చేరింది. శుక్రవారం ఎన్ఎస్ఈలో భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్, రిలయన్స్ తదితర కంపెనీల స్టాక్స్ లాభపడ్డాయి. యెస్ బ్యాంకు, ఇండియాబుల్స్ హెచ్ఎస్జీ, జేఎస్డబ్ల్యు స్టీల్ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి.