Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.1779 కోట్లకు పైగా బకాయిలపై దృష్టి
- బిడ్లకు ఆహ్వానం
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)లో నిరర్ధక ఆస్థుల(ఎన్పీఏ)కు సంబంధించిన దాదాపు 24 ఖాతాలను అమ్మకానికి పెట్టారు. దాదాపు రూ.1779 కోట్లకు పైగా ఉన్న బకాయిలను తిరిగి రాబట్టుకోవడమే లక్ష్యంగా ఆశవహుల నుంచి బిడ్లను బ్యాంకు ఆహ్వానించింది. ఈ మేరకు వెబ్సైట్లో నోటీసును పీఎన్బీ జారీ చేసింది. కాగా, బకాయిపడిన 24 ఖాతాల్లో బ్యాంకుకు చెందిన ముంబయి, ఢిల్లీ, కోల్కతా జోన్లలో అధికంగా ఉన్నాయి. రెండు ఖాతాలు ఛండీగఢ్, భోపాల్ జోన్లవి కాగా, ఒకటి పాట్నా జోన్కు చెందినదిగా ఉంది. ఈ ప్రక్రియను బ్యాంకుకు చెందిన సస్త్రా విభాగం నిర్వహించనుంది. ఇ-వేలం పద్దతి ద్వారానే బిడ్లను సమర్పించాల్సి ఉంటుంది. దీనికి నేడే(సోమవారం) తుది గడువుగా ఉంది. ఇ-వేలం ప్రక్రియ ఈనెల 21న జరగనుంది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు పీఎన్బీకి దాదాపు రూ.14వేలకు పైగాకుచ్చుటోపీ పెట్టడంతో బ్యాంకు భారీ దెబ్బను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెరిగిపోయిన మొండి బకాయిల కారణంగా రూ.4,532.35 కోట్ల నష్టం వాటిల్లినట్టు పీఎన్బీ తెలిపింది.