Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ముచ్చటగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూల పరిణా మాలకు తోడు కాపిటల్ గూడ్స్, కనూ మర్ డ్యురెబుల్స్, రియాల్టీ, ఎఫ్ఎంసీజీ సూచీల కొనుగోళ్ల మద్దతుతో గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 150.57 పాయింట్లు పెరిగి 35,929.64 పాయింట్లకు చేరింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 53.95 పాయింట్లు (0.5 శాతం రాణించి) 10,791.55 వద్ద ముగిసింది. క్రితం నవంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ తగ్గడం, అక్టోబర్లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ పెరగడం మదుపర్లలో విశ్వాసాన్ని నింపింది. బీఎస్ఈలో రంగాల వారిగా కన్జూమర్ డ్యూరెబుల్స్ సూచీ 1.40 శాతం, కాపిటల్ గూడ్స్ సూచీ 1.27 శాతం, రియాల్టీ సూచీ 1.19 శాతం, ఎఫ్ఎంసీజీ సూచీ 0.86 శాతం, ఆటో సూచీ 0.85 శాతం చొప్పున లాభపడి మేటిగా రాణించిన స్టాక్స్ జాబితాలో ముందు వరసలో నిలిచాయి. కాగా ఒక్క లోహ సూచీ మాత్రం 0.66 శాతం నష్టపోయింది. సెన్సెక్స్లో 13 స్టాక్స్ నష్టపోగా 18 సంస్థల స్టాక్స్ లాభపడ్డాయి. విప్రో 2.64 శాతం, ఇన్ఫోసిస్ 2.62 శాతం, కోటక్ బ్యాంకు 2.56 శాతం, మారుతీ సుజుకీ 2.18 శాతం, ఎల్అండ్టీ 1.77 శాతం చొప్పున అధికంగా లాభపడిన వాటిలో టాప్లో ఉన్నాయి. మరోవైపు యెస్ బ్యాంకు 6.48 శాతం, సన్ ఫార్మా 2.12 శాతం, టీసీఎస్ 1.74 శాతం, టాటా స్టీల్ 1.57 శాతం, అదానీ పోర్ట్సు 1.01 శాతం చొప్పున కుంగి అధికంగా నష్టపోయిన స్టాక్స్ జాబితాలో ముందు వరుసలో నిలిచాయి. చిన్న స్టాక్స్రాణించడంతో బీఎస్ఈ స్మాల్ క్యాప్, మిడ్క్యాప్ సూచీలు రాణించాయి. దీంతో మార్కెట్లకు మరింతగా దన్ను లభించింది.