Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి విడుదల
హైదరాబాద్: ఎస్ఎఆర్ గ్రూపునకు చెందిన లివ్ఫాస్ట్ మార్కెట్లోకి 25 శాతం వేగవంతమైన ఛార్జింగ్, 25 శాతం అదనపు బ్యాటరీ బ్యాకప్తో కూడిన ఇన్వర్టర్ల శ్రేణిని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ గ్రూపు వాహన బ్యాటరీఉ, ఇన్వర్టర్లు, ఇన్వర్టర్ బ్యాటరీల వ్యాపారంలో ఉంది. క్రితం ఆర్ధిక సంవత్సరంలో రూ.1000 కోట్ల టర్నోవర్ నమోదు చేశామని లివ్ఫాస్ట్ సీఈఓ గురుప్రీత్ సింగ్ బాటియా తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లివ్ఫాస్ట్ బ్యాటరీలకు ప్రముఖ క్రికెటర్ ధోణిని ప్రచారకర్తగా నియమించుకున్నామన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి రెట్టింపు రెవెన్యూ రూ.2,000 కోట్లు అంచనా వేస్తున్నామన్నారు. ఇన్వెర్టర్ల విభాగంలో వచ్చే 15 మాసాల్లో 15 శాతం మార్కెట్ వాటా అంచనా వేస్తున్నామన్నారు. ప్రస్తుత ఏడాది ముగింపు నాటికి దేశ వ్యాప్తంగా 25,000 అవుట్లెట్లకు విస్తరించనున్నామన్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 22 మంది డిస్ట్రిబ్యూటర్లు, 3,000 మంది ్డడీలర్లకు విస్తరించనున్నామని తెలిపారు. తాము ప్రస్తుతం 18 మోడళ్ల బ్యాటరీలను తయారు చేస్తున్నామన్నారు. దేశంలో రూ.55వేల కోట్ల విలువ చేసే ఇన్వెర్టర్ల బ్యాటరీల వ్యాపారం జరుగుతుందన్నారు.