Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.8,260 కోట్ల షేర్ల బైబ్యాక్
ముంబయి : దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఆర్ధిక ఫలితాలు నిరాశ పర్చాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్తో ముగిసిన తృతీయ త్రైమాసికం (క్యూ3)లో ఇన్ఫీ లాభాలు 3,610 కోట్లకు పడిపోయాయి. 2017-18 ఇదే త్రైమాసికంలో రూ.5,129 కోట్ల లాభాలు సాధించింది. దీంతో పోల్చితే క్రితం క్యూ3 లాభాల్లో 30 శాతం పతనం చోటు చేసుకుంది. బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఇన్ఫీ క్రితం క్యూ3లో 20.3 శాతం వృద్ధితో రూ.21,400 కోట్ల రెవెన్యూ సాధించింది. ఇంతక్రితం క్యూ3లో రూ.17,794 కోట్ల రెవెన్యూ నమోదు చేసింది. క్రితం డిసెంబర్ త్రైమాసికంలో కొత్తగా 18,773 మంది ఉద్యోగులను తీసుకున్నట్లు వెల్లడించింది.
ప్రత్యేక డివిడెండ్..
ప్రతీ షేర్పై ప్రత్యేక డివిడెండ్ కింద రూ.4 చెల్లించనున్నట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. దీంతో ఇన్వెస్టర్లకు రూ.2,107 కోట్లు అందించనుంది. జనవరి 25న దీనికి కచ్చిత తేదిగా నిర్ణయించగా, 28వ తేదిన చెల్లింపులు చేయనున్నట్టు పేర్కొంది. అదే విధంగా రూ.8,260 కోట్ల విలువ చేసే ఈక్విటీలను బైబ్యాక్ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రతీ షేర్ ధరను రూ.800గా నిర్ణయించింది. 2018-19 రెవెన్యూ గైడ్లైన్స్ను 8.5-9 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. స్థిర ధరల వద్ద క్యూ3లో తాము రెండంకెల వృద్ధిని నమోదు చేశామని ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండి సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. డిజిటల్ బిజినెస్లో మరో పటిష్టమైన వృద్ధి సాధించామన్నారు. ఈ విభాగంలో 33.1 శాతం వృద్ధితో 1.57 బిలియన్ డాలర్ల రెవెన్యూ నమోదయ్యిందని.. 2019లో విశ్వాసంతో ప్రవేశించడానికి దోహ దం చేస్తుందన్నారు. క్రితం త్రైమాసికంలో కొత్తగా 101 మంది ఖాతాదారులను పొందింది. దీంతో తమ ఆక్టివ్ క్లయింట్ల సంఖ్య 1,251గా ఉందని వెల్లడించింది. కాగా వచ్చే ఏప్రిల్ ఒక్కటో తేది నుంచి కిరణ్ మజూందర్ షాను తిరిగి ఇండిపెం డెంట్ డైరెక్టర్గా తీసుకోవడానికి ఆ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. శుక్రవా రం బీఎస్ఈలో ఇన్ఫోసిస్ షేర్ 0.58 శాతం పెరిగి రూ.683.70 వద్ద ముగిసింది.