Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: తమ బ్యాంక్ బోర్డు చైర్మెన్గా మాజీ ఐఏఎస్ అధికారి బ్రహ్మదత్ను(70) నియమిం చుకున్నట్టుగా దేశంలో నాలుగో అతిపెద్ద ప్రయివేటు బ్యాంకింగ్ సంస్థ యెస్ బ్యాంక్ వెల్లడించింది. బ్యాంక్ బోర్డుకు తాత్కాలిక చై ర్మెన్గా దత్ను నియమించుకొనేందుకు గాను భారతీయ రిజర్వు బ్యాంక్ సమ్మతి తెలిపినట్టుగా యెస్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. దత్ ఈ పదవిలో 2020 జులై4 వరకు కొనసాగనున్నట్టుగా బ్యాంక్ వర్గాలు తెలిపాయి. 2013 నుంచి దత్ యెస్ బ్యాంక్ బోర్డులో స్వతంత్ర డైరెక్టరుగా సేవలందిస్తున్నారు. గడిచిన 5.5 యేండ్ల కాలంగా ఆయన బ్యాంక్కు చెందిన వివిధ సబ్ కమిటీలలో తన వంతు సేవలను అందించినట్టుగా బ్యాంక్ యెస్ బ్యాంక్ తెలిపింది. ఐఏఎస్ అధికారిగా దత్ దాదాపు 37 సంవత్సరలపాటు కర్ణాటక ప్రభుత్వంలోను, కేంద్ర ప్రభుత్వంలోను పని చేశారు.