Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్తో గురువారం ప్రముఖ పారిశ్రామిక వర్గాల వారితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భాగంగా పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గురించి శక్తికాంత వారిని అడిగి తెలుసుకున్నట్టుగా సమాచారం. సమావేశంలో భాగంగా పరిశ్రమ వర్గాలు ఆర్బీఐ గవర్నర్తో ముచ్చటిస్తూ కీలక వడ్డీ రేట్లను తగ్గించాలని కోరినట్టుగా సమాచారం. వృద్ధికి మద్దతునివ్వడానికి రుణాలపై వడ్డీ రేట్లను మరింత అందుబాటులోకి తేవాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిస్టీస్ (సీఐఐ), ఫిక్కీ ప్రతినిధులు కోరారు. దీనికి తోడు నగదు నిల్వల నిష్పత్తిలో (సీఆర్ఆర్)లో 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించాలని చర్యలు తీసుకోవాలని సీఐఐ సూచించింది. ఇప్పటికే ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నందున వడ్డీ రేట్ల తగ్గిస్తే బాగుంటుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఫిబ్రవరి 7న ఆర్బీఐ ఆరో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించనుంది.ప్రస్తుతం సీఆర్ఆర్ 4 శాతంగా, ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై విధించే రెపో రేటు 6.5 శాతంగాను ఉంది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు విత్త సమస్యలను ఎదుర్కొంటున్నాయని సీఐఐ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది. వ్యక్తిగత గ్యారంటీతో ఈ రంగాలకు రుణాలు ఇవ్వాలని కోరింది.