Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్వి స్టాక్ బ్రోకింగ్ సీఈవో రాజ్ సింగ్
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రస్తుత సంవత్సరం స్టాక్ మార్కెట్లు మదుపరులకు మెరుగైన లాభాలను అందించే అవకాశం ఉన్నట్టుగా కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ సీఈవో రాజీవ్ సింగ్ తెలిపారు. 2019లో ఈక్విటీ మార్కెట్లలో సామర్థ్యం కలిగిన స్టాక్స్లో రాబడులు పెరుగొచ్చని ఆయన విశ్లేషించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ అంచనాల ప్రకారం నిఫ్టీ 11,750 వద్ద ప్రతిఘటన ఎదుర్కొవడంతో పాటు.. 12వేల స్థాయి వద్ద కూడా ఒడిదుడుకులకు గురైయ్యే అవకాశం ఉందన్నారు. 2018లో నిఫ్టీ కేవలం 3 శాతం రాబడులను మాత్రమే అందించిందని తెలిపారు. ప్రస్తుత ఏడాది ముగింపు నాటికి నిఫ్టీ 14 వేల మార్క్ను చేరుకోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాము బ్యాంకులు, క్యాపిటల్ గూడ్స్, సైక్లికల్ రంగాలకు ప్రాధాన్యతనిస్తామన్నారు.2019 ప్రథమార్థంలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో దేశ మార్కెట్లకు ప్రస్తుత ఏడాది కీలకమైందన్నారు.అంతర్జాతీయంగా వాతావరణం సానుకూలంగా ఉండటంతో మార్కెట్లపై విశ్వాసం పెరుగొచ్చన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో భారీగా తగ్గిందని, దీంతో రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించొచ్చన్నారు.