Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంకు అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి మెరుగైన ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. ఏడాది ప్రాతిపదికన పోలిస్తే డిసెంబరు మాసాం తానికి సంస్థ నికర లాభం 20.31 శాతం పెరిగిందని సంస్థ తెలిపింది. గత త్రైమాసికంలో సంస్థ నికర లాభం రూ.5,585.85 కోట్లుగా నమోదైనట్టుగా వెల్లడించింది. అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ లాభం రూ.4,642.60కోట్లుగా నమోదు అయింది. ఈసారి నికర వడ్డీ ఆదాయం పెరగడంతో సంస్థ ఎక్కువగా లాభపడినట్లు పేర్కొంది. కంపెనీ నికర వడ్డీ ఆదాయం డిసెంబరు త్రైమాసికంలో 21.9 శాతం మేర పెరిగి రూ.12,576.75 కోట్లుగా నమోదైందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెల్లడించింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం రూ.10,314.3కోట్లుగా నమోదైనట్లు తెలిపింది.