Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నార్త్బ్లాక్లో వేడుకగా హల్వా కార్యక్రమం
న్యూఢిల్లీ: రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ముద్రణ కార్యక్రమాలు లాంఛనంగా మొదలయ్యాయి. సోమవారం ఆర్థిక శాఖ కార్యాలయంలో నిర్వహించిన హల్వా వేడుకలతో ఇవి ప్రారంభమయ్యాయి. ప్రతి బడ్జెట్కు ముందు సంప్రదాయం ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుక నిర్వహిస్తుండడం ఆనవాయితి. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లిన కారణంగా ఈ ప్రీ బడ్జెట్ వేడుక కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివప్రతాప్ శుక్లా నేతృత్వంలో జరిగింది. దీంతో సోమవారం నుంచి మధ్యంతర బడ్జెట్ కాగితాల ముద్రణ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రవాణ శాఖ మంత్రి పొన్ రాధాకృష్ణన్, ఆర్థిక శాఖ కార్యదర్శి డీఈఏ సుభాష్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ సమర్పించడానికి పదిరోజుల ముందు ప్రతుల ముద్రణను ప్రారంభిస్తారు. ఇందులో పాల్గొనే సిబ్బంది దాదాపు 10 రోజుల పాటు అక్కడే ఉంటారు.