Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త ట్రేడింగ్ వారానికి సోమవారం శుభారంభం చేశాయి. రిలయన్స్ ఇండిస్టీస్, ఐటీ, బ్యాంకు సూచీల కొనుగోళ్ల మద్దతుతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 192 పాయింట్లు రాణించి 36,578 పాయింట్ల వద్ద స్థిరపడింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 55 పాయింట్లు పెరిగి 10,961 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో 9 స్టాక్స్ లాభపడగా, మిగితా 21 స్టాక్స్ నష్టపోయాయి. రిలయన్స్ ఇండిస్టీస్ 4.30 శాతం, కోటక్ బ్యాంకు 2.96 శాతం, సన్ ఫార్మా 1.98 శాతం, బజాజ్ ఫినాన్స్ 1.69 శాతం చొప్పున పెరిగి మార్కెట్లకు ప్రధాన మద్దతును అందించాయి. కాగా యెస్ బ్యాంకు, హీరో మోటో కార్ప్, మారుతీ సుజుకీ, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో 1.42-3.61 శాతం వరకు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.