Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 194 పాయింట్ల పతనమైన సెన్సెక్స్
ముంబయి : వరుసగా ఆరు సెషన్ల నుంచి రాణించిన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలను చవి చూశాయి. అంతరా ్జతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) 2019-20 ప్రపంచ వృద్ధి రేటు అంచనాలకు కోత పెట్టడం, చైనా వృద్ధి రేటు తగ్గిందన్న రిపోర్టులు అంతర్జాతీయ మార్కెట్లను కలవరానికి గురి చేశాయి. ఈ పరిణామం భారత మార్కెట్లపై ప్రతికూలత చూపించింది. దీంతో మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 137 పాయింట్లు తగ్గి 36,445కు పడిపోయింది.. ఎన్ఎస్ఈ నిఫ్టీ 39 పాయింట్లు కోల్పోయి 10,923 వద్ద ముగిసింది. 2018లో చైనా వృద్ధి రేటు 6.6 శాతానికి తగ్గిందన్న రిపోర్టులు మదుపర్లను ఆందోళనకు గురి చేసింది. అదే విధంగా అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో 11 పైసలు తగ్గి 71.40కు దిగజారింది. తుదకు 16 పైసలు నష్టపోయి 71.44 వద్ద ముగిసింది. రూపాయి విలువ తగ్గడంతో పలు సూచీలు ఒత్తిడికి గురైయ్యాయి. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ రెండు సూచీలు, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ 3,63 శాతం వరకు పడిపోయి సెన్సెక్స్ నష్టాలకు కారణమయ్యాయి. అదే విధంగా టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, హెచ్సీిఎల్ టెక్ అధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. సెన్సెక్స్-30లో 9 స్టాక్స్ లాభపడగా.. మిగితా స్టాక్స్ అన్నీ ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. లోహ రంగం అత్యధికంగా 2.31 శాతం నష్టపోయింది. టెలికం, ఆటో, ఫైనాన్స్ రంగాలు అధిక నష్టాలు చవి చూశాయి. బీఎసఈలో మిడ్క్యాప్ సూచీలు 0.09% చొప్పున తగ్గాయి.