Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద చమురు, సహజ వాయువు ఉత్పత్తి సంస్థ ఓఎన్జీసీ 2018-19 డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 64.8 శాతం వృద్ధితో రూ.8263 కోట్ల నికర లాభాలు సాధించింది. మార్కెట్ విశ్లేషణల అంచనాలకు మించి లాభాలు పెరిగాయి. ఇంతక్రితం ఆర్ధిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.5,013 కోట్ల లాభాలు నమోదు చేసింది. క్రితం క్యూ3లో కంపెనీ రెవెన్యూ 20.42 శాతం పెరిగి రూ.27,694 కోట్లకు చేరింది. 2017-18 ఇదే క్యూ3లో రూ.22,996 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. గురువారంబీఎస్ఈలో ఓఎన్జీసీ షేర్ 1.12 శాతం తగ్గి రూ.132.10 వద్ద ముగిసింది.