Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రస్తుత ఏడాది జనవరిలో దేశ వాణిజ్య లోటు 14,73 బిలియన్ డార్లకు పెరిగిందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. దిగుమతులు పెరగడం ఎగుమతులు తగ్గడం వల్ల వాణిజ్య లోటు ఏర్పడుతుంది. 2018 డిసెంబర్లో ఈ లోటు 13.08 బిలియన్ డాలర్లుగా చోటు చేసుకుంది. ఏడాదికేడాదితో పోల్చితే క్రితం జనవరిలో దేశ ఎగుమతులు 3.74 శాతం పెరిగి 26.36 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇదే మాసంలో దిగుమతులు 0.01 శాతం పెరిగి 41.09 బిలియన్ డాలర్లుగా చోటు చేసుకున్నాయి. క్రితం మాసంలో బంగారం దిగుమతులు 38.16 శాతం పెరిగి 2.31 బిలియన్ డాలర్లకు చేరాయి.