Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: మోటరోలా సంస్థ భారత మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ఫోన్ను అందుబాటులోకి తెచ్చింది ఆకట్టుకునే ఫీచర్లతో పాటు 5000 ఎంఏహెచ్ మేగా బ్యాటరీతో రూపొందించి 'మోటరోలా జీ7' స్మార్ట్ఫోన్ను కంపెనీ శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. 6.24 అంగుళాల ఫుల్ హెచ్డి తెర, ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్, స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ, 12ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు 15 వాట్స్ టర్బోపవర్ సపోర్ట్ బ్యాటరీ, వెలిముద్ర స్కానర్ ఈ ఫోన్లో అదనపు ఫీచర్లు. మోటరోలా సంస్థ ఆన్లైన్తో పాటుగా మొదటి సారిగి ఇండియాలో ఆఫ్లైన్ దుకాణాలలో కూడా ఈ ఫోను విక్రయించనున్నట్టుగా ప్రకటించింది. ఈ ఫోన్ ధరను కంపెనీ రూ.13,999గా ప్రకటించింది. మోటరోలా.ఇన్ వెబ్సైట్, మోటో స్టోర్ లేదా మోటో హబ్, సిటీ, స్టేట్ ఎంచుకొని ఈ ఫోన్ను కొనుగోలు చేయవచ్చని సంస్థ తెలిపింది. త్వరలో ఫ్లిప్కార్ట్లో కూడా ఈ మొబైల్ అందుబాటులోకి రానుందని కంపెనీ వెల్లడించింది.