Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరేండ్లలో స్టాక్ మార్కెట్ ఊహించనంత భారీగా..
ముంబయి: స్టాక్మార్కెట్లో ఇప్పుడు బైబ్యాక్ల సీజన్ సందడి చేసు ్తన్నది.2019లో దాదాపు పాతిక కంపెనీలు తమ షేర్లను బైబ్యాక్ చేయ నున్నట్టు ప్రకటించాయి. వీటిల్లో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా ఉన్నది. 2018లో బైబ్యాక్ల మొత్తం విలువ రూ.54.5వేల కోట్లు. గత ఆరేండ్ల లో ఇంత మొత్తంలో బైబ్యాక్లకు రావడం ఇదే మొదటిసారి కావటం విశేషం. ఈ ఏడాది ప్రకటించిన కంపెనీల్లో ఇన్ఫీ బైబ్యాక్ విలువే రూ.8.2వేల కోట్లు. ప్రధానంగా రెండు అంశాలపై ఆయా సంస్థలు దృష్టి పెట్టాయి. వీటిలో అదనపు నిధులను వాటాదారులకు అందజేయటం.. డివిడెండ్లపై పన్నుభారం తగ్గించుకొనేందుకు ఈ వ్యూహం దోహదపడు తుందని వ్యాపార నిపుణులు అభిప్రాయపడు తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా షేరు విలువ పడిపో కుండా కాపాడుకోవచ్చు. చిన్న కంపెనీలూ విలువ కాపాడుకునేందుకు బైబ్యాక్ల బాటపడుతున్నాయి. ఇదే సమయంలో కంపెనీ వ్యవస్థాప కులు భవిష్యత్తుపై ఆశావహదృక్పథంతో ఉన్నారని ఈ బైబ్యాక్లు వెల్లడ వుతున్నాయి. జనవరి 1 నుంచి మిడ్క్యాప్ కంపెనీల షేర్లు దాదాపు 10శాతం కుంగాయి. 2011 తర్వాత ఈ కంపెనీల షేర్ల విలువ ఇంతగా కుంగింది. ప్రభుత్వ రంగ కంపెనీలు కూడా బైబ్యాక్లకు మొగ్గు చూపుతున్నాయి.