Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ వాణిజ్యవిభాగం-హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరంలోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించ తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు పనుల ను జీఎంఆర్ సంస్థ దక్కించుకుంది. పోటీ సంస్థల కన్నా జీఎంఆర్ సంస్థ ప్రభుత్వానికి అధిక మొత్తంలో రెవెన్యూ పంపకానికి ఆసక్తి కనబర చడంతో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు పనులను జీఎంఆర్కు అప్పగించాలని నిర్ణయించినట్టుగా ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొ రేషన్ వెల్లడించింది. ఒక్కో ప్రయాణికుడిపై రూ.303 మొత్తాన్ని రెవెన్యూ రూపంలో ప్రభుత్వానికి చెల్లించేదుకు జీఎంఆర్ ఆసక్తి వెల్లడిస్తూ బిడ్ దాఖలు చేసినట్టుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా ప్రధాన పోటీ సంస్థలైన డుయిట్ స్మార్ట్ ఇన్ఫ్రా ఇండియా, జీవీకే సంస్థలు వరుసగా రూ.261, రూ.207ల రెవెన్యూ షేరింగ్కు ఆసక్తి కనబరుస్తూ బిడ్లు దాఖ లు చేసినట్టుగా ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రాజెక్టు విలువ దాదాపు రూ.2700 కోట్లు. ఎయిర్పోర్టుకు అనుబంధంగా విమానాల నిర్వహణ కోసం ఎంఆర్వో ఫెసిలిటీతో బిడ్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.