Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బంగారం ధర బుధవారం మరింతగా పెరిగాయి. రూపాయి పతనం సహా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు కారణమని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. రూపాయి పతనం కూడా పసిడి పరుగుకు దోహదపడింది. బుధవారం రూపాయి 42 పైసలు క్షీణించి 71.49కి పతనమైంది. దీంతో ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 పెరుగుదలతో రూ.34,650కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.120 పెరుగుదలతో రూ.34,480కు చేరింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,600 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. వెండి ధర ఔన్స్కు 0.22 శాతం తగ్గుదలతో 15.94 డాలర్ల వద్ద క్లోజయ్యింది. బంగారం ధర బాటలోనే వెండి ధరలు కూడా నడిచాయి. కేజీ వెండి ధర రూ.70 పెరుగుదలతో రూ.41,475కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, వెండి నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు దోహదపడింది. హైదరాబాద్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.33,530కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.31,930కు పెరిగింది. కేజీ వెండి ధర రూ.43,600కు చేరింది.