Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 500 కోట్ల విలువైన నకిలీ ఇన్వాయిస్లు
- రానున్న రోజుల్లో జీఎస్టీ మరింత సరళీకరణ
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు రూ.20,000 కోట్ల విలువైన జీఎస్టీ పన్ను ఎగవేతలను గుర్తించినట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. రానున్న కాలంలో వీటిని నియం త్రించి, పన్ను చెల్లింపులు పెంచేందుకు గాను తాను మరిన్ని చర్యలు చేపట్టనున్నట్టుగా సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ విచారణ విభాగం సభ్యులు జాన్ జోసఫ్ తెలిపారు. తగ్గించిన జీఎస్టీ రేట్లను వినియోగదారలుకు అందించే విషయ మై ఎదురవుతున్న సమస్యలను గురించి చర్చించేం దుకు గాను తాము స్థిరాస్తి రంగ సంస్థలకు చెందిన వారితో త్వరలోనే తగిన చర్యలను ప్రారంభించను న్నట్టుగా ఆయన వివరించారు. ఇటీవల ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో సమావేశమైన జీఎస్టీ మండలి నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తు భవనాలు, చౌక ధరల హౌసింగ్స్పై జీఎస్టీని ఐదు శాతం, ఒక్క శాతం మేర తగ్గించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో జీఎస్టీ ఎగవేతల మొత్తం దాదాపు రూ.20,000 కోట్ల దరిదాపుల్లో ఉన్నట్టుగా గుర్తించామని, ఇందులో దాదాపు రూ.10,000 కోట్ల మొత్తాన్ని తాము రికవరీ చేస నట్టుగా ఆయన వివరించారు.
దాదాపు రూ. 75 కోట్ల మేర విలువైన జీఎస్టీ క్రెడిట్ను అందుకొనేం దుకు గాను పన్ను అధికారులు దాదాపు రూ.1500 కోట్ల విలువైన నకిలీ ఇన్వాయిస్లను తయారు చేసినట్టుగా తాము గుర్తించామని ఆయన తెలిపారు. వీటిలో దాదాపు రూ.25 కోట్ల మొత్తాన్ని తాము రికవరి చేశామని ఆయన వివరించారు. కేవలం 5 నుంచి 10 శాతం వ్యాపారాలు అక్రమ మార్గాలను అవలంభిస్తున్న ట్టుగా తాము గుర్తించామని ఆయన అన్నారు. వీటిని నివారించి రానున్న రోజుల్లో పన్ను చెల్లింపులు పెరిగే విధంగా తగిన చర్యలను చేపట్టను న్నట్టుగా ఆయన తెలిపారు. జీఎస్టీని హేతుబద్ధీకరిం చేందుకు గాను ప్రభుత్వం ఎంతొ చొరవతో పని చేస్తోందని.. దీనికి తోడు జీఎస్టీలో నమోదు అయిన వారి సంఖ్యం 1.2 కోట్లకు చేరినట్టుగా ఆయన వివరించారు. రానున్న రోజుల్లో అందరికీ అమోదయోగ్యంగా ఉండే విధంగా జీఎస్టీ పన్ను శ్లాబ్లను తగ్గించనున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న శ్లాబ్ల మూలంగా కొన్ని వర్గాల వారికి ఇబ్బందులు, కొందరికి అనుమానాలు ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో జీఎస్టీ హేతుబద్దీకరణ ఉంటుందన్నారు.