Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బడ్జెట్ ధరలకు స్మార్ట్ఫోన్లను అందించే ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రెడ్ మి నోట్7, నోట్ 7ప్రో ఫోన్లను తొలిసారిగా భారత్లో విడుదల చేసింది. స్థానికంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో షామీ ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ ఈ ఫోన్ల ఫీచర్లను, ధరలను వెల్లడించారు. రెడ్మి నోట్ 7 ప్రో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధరను రూ.13,999గా నిర్ణయించగా, 6జీబీ ర్యామ్ం64జీబీ మొబైల్ ధరను రూ.16,999గా ప్రకటించారు. 6.3 ఫుల్హెచ్డీ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్, వెనుకవైపు 48 మెగా పిక్సెల్, 5 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 586 కెమేరా, ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమేరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ ఛార్జింగ్ 4.0సపోర్ట్లు ఈ ఫోన్ ప్రత్యేకతలు. ఇక మరో ఫోన్ రెడ్మి 7ను కూడా మనుకుమార్ జైన్ విడుదల చేశారు. 3జీబీ ర్యామ్ 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్ ధర రూ.9,999 గాను, 4జీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ కలిగిన మొబైల్ ధరను రూ.11,999గాను కంపెనీ నిర్ణయించింది. 6.3ఫుల్ హెచ్డీ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్, రెండు 12మెగాపిక్సెల్ వెనుక కెమేరా, 13 మెగాపిక్సెల్ ముందు కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం క్విక్ ఛార్జింగ్ 4.0 సపోర్ట్లు ఇందులో ప్రత్యేకతలు. ఈ నెల (మార్చి) 6వ తేదీ నుంచి ఈ ఫోన్ను విక్రయించనున్నట్టుగా కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.