Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా పోటీనిచ్చే ఆరోగ్యకరమైన బ్యాంకులను ఏర్పాటు చేసేందుకే తాము ప్రభుత్వ రంగ బ్యాంకుల వీలనపు ప్రక్రియను అనుసరిస్తు న్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. భారతీయ బ్యాంకుల సంఘం (ఐబీఏ) సమావేశంలో జైట్లీ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల కారణంగా గడిచిన రెండు, మూడు త్రైమాసికాల్లో స్థూల నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) పరిస్థితి మెరుగైందని వెల్లడించారు. నేతలు, పలుకుబడి ఉన్నవారు పదేపదే ఫోన్లు చేస్తూ బ్యాంకు విధుల్లో జోక్యం చేసుకొనే విషమ పరిస్థితికి తమ ప్రభుత్వం చరమగీతం పాడిందన్నారు. 'బ్యాంకులను పటిష్ఠం చేసేందుకు చట్టపరమైన, ఇతర చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం మెల్లమెల్లగా విలీన ప్రక్రియ విధానాన్ని అనుసరిస్తోంది. మూడు త్రైమాసికాలుగా నిరర్ధక ఆస్తుల్లో తగ్గుదల నమోదు అవుతోంది' అని జైట్లీ తెలిపారు. 2014-15 నుంచి 2018 డిసెంబర్ వరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.2.87 లక్షల కోట్ల ఎన్పీఏలు వసూలు చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి తొమ్మిది నెలల్లో రూ.98,493 కోట్లు వసూలు చేశాయి. గతేడాదితో పోలిస్తే ఇది 100 శాతం వ ద్ధి కావడం విశేషం. 'ఇప్పటికే మూడు విలీన ప్రక్రియలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 1న పూర్తవుతాయి. విలీనం విజయవంతం అవుతుందో లేదో భవిష్యత్తులో తెలుస్తుంది' అని ఎస్బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు. విజయ బ్యాంకు, దేనా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా విలీన ప్రక్రియకు ప్రభుత్వం ఇంతకు ముందే ఆమోదం తెలిపింది.