Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బైక్స్ తయారీ సంస్థ కేటీఎం సంస్థ తాజాగా తన డ్యూక్ 250 బైక్ను అత్యాధునిక భద్రతా ఫీచర్లతో అప్డేట్ చేసి మార్కెట్లోకి విడుదల చేసింది. డ్యూక్ 250 బైక్ను సంస్థ ఏబీఎస్ (యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఫీచర్తో అప్డేట్ చేసింది. డ్యూక్ 250లో నాన్ ఏబీఎస్ వేరియంట్తో పోలిస్తే ఏబీఎస్ వేరియంట్ ధర రూ.14,000 ఎక్కువగా ఉంది. కేటీఎం 250 డ్యూక్ బైక్ ఎక్స్షోరూమ్ ధర రూ.1.94 లక్షలు. భారత్లో ఏప్రిల్ 1 నుంచి కొత్త భద్రతా ప్రమాణాలు అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలోనే టూవీలర్ తయారీ కంపెనీలన్నీ వాటి వాటి బండ్లను అధునిక భద్రతా ప్రమాణాలకు అనువుగా అప్డేట్ చేస్తున్నాయి. 125 సీసీ సామర్థ్యం వరకు ఇంజిన్లు కలిగిన టూవీలర్లకు కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (సీబీఎస్)తోను.. 125 సీసీ ఆపై సామర్థ్యమున్న ఇంజిన్లు కలిగిన టూవీలర్లకు ఏబీఎస్ స్టాండర్డ్ ఫీచర్గా ఉండాలంటూ ప్రభుత్వం నిబంధనలను తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే కొత్త డ్యుక్ 250 వాహనానికి కంపెనీ స్విచబుల్ డ్యూయెల్ చానల్ ఏబీఎస్ ఫీచర్ను అమర్చింది. ఇక బైక్ ఫీచర్లలో ఎలాంటి మార్పులు లేవు. 250 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్, 30హెచ్పీ, 24 ఎన్ఎం టార్క్తో కూడిన ఇంజిన్ అలాగే ఉంది. గతంలో మాదిరిగా ఆరు గేర్లు కొనసాగనున్నాయి. స్లిప్పర్ క్లచ్, హాలోజెన్ హెడ్ల్యాంప్, ఓల్డ్ డిజిటల్ కన్సోల్, 13.4 లీటర్ల ఇంధనపు ట్యాంక్, 230 ఎంఎం బ్యాంక్ రేర్ డిస్క్ వంటి ప్రత్యేకతలు కొత్త బైక్లోనూ కొనసాగనున్నాయి.