Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ దేశీయ మార్కెట్లోఇక సరికొత్త కారును అందుబాటులోకి తెచ్చింది. ఏఎంజీ సీ 43 కూపే 2019 వెర్షన్లో మెర్సిడెస్ బెంజ్ కొత్త లగ్జరీ కారును గురువారం మార్కెట్లోకి ఆవిష్కరించింది. దీని ధరను రూ. 75 లక్షలుగా ( ఎక్స్ షో రూం ) నిర్ణయించింది. రెండు డోర్లతో కూడిన కూపే కారును సంస్థ 3.0 లీటర్ వీ 6 టర్బో ఇంజీన్తో రూపొందించింది. ఇది 287 కిలోవాట్స్ శక్తి. 520 గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుందని కంపెనీ తెలిపింది. 4.7 సెకన్లలోనే 100 కి.మీ వేగాన్ని అందుకోవడం ఈ కారు ప్రత్యేకత. ఔత్సాహిక యువ వాహన చోదకుల కోసం మెర్సిడెస్ ఏఎంసీ బ్రాండ్లో కొత్త మోడల్ ప్రవేశపెట్టడం చాలా ఆనందంతంగా ఉందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ మార్టిన్ స్కువెంక్ చెప్పారు. విలాసవంతమైన ప్రయాణం కోరుకొనే వారి కోసం మెరుగైన ఉత్పత్తులను తీసుకువచ్చే విషయంలో తమ మెర్సిడెస్ సంస్థ ఎల్లవేళలా ముందుంటుందని ఆయన వివరించారు.