Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం తీవ్ర లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. అంతర్జాతీయంగా ప్రతికూలతలు, రూపాయి విలువ క్షీణించడంతో పాటు స్టాక్స్ అత్యధిక ధరల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంలో మార్కెట్ల భారీ లాభాలను చేజార్చుకున్నాయి. దీంతోమార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 35పాయింట్ల లాభంతో 38,398వద్ద, నిఫ్టీ 8 పాయింట్ల నష్టంతో 11,524 వద్ద ముగిశాయి. నేటి మార్కెట్లో ఇన్పోసిస్ షేర్లు దాదాపు 3శాతం పెరిగాయి. నేటి అమెరికాలో ఫెడ్ విధాన నిర్ణయం ప్రకటించనుండంటంతో ఆసియా మార్కెట్లలో లాభాల స్వీకరణ జరిగింది. జపాన్ సూచీలు మాత్రం 0.2శాతం లాభపడ్డాయి. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా సూచీలు నష్టాల బాటలో కొనసాగాయి. నుంచి ఓపెన్మార్కెట్లో బైబ్యాక్ ఆఫర్ ప్రారంభం కావడంతో షేరు ధర దూసుకుపోయింది. మరోపక్క కాఫీడే షేరు 2 శాతం నష్టాల్లో ట్రేడైంది. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో కూడా ఈ షేరు దాదాపు 6శాతం విలువ కోల్పోయింది. కంపెనీ ప్రమోటర్ సిద్ధార్థ మైండ్ట్రీలో వాటాలను విక్రయించడం ఈ షేరుపై ప్రభావం చూపింది.