Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ విభాగం చైర్మెన్గా డి.రాజు ఎన్నిక య్యారు. కిర్బీ సిస్టమ్స్ అండ్ స్ట్రక్చర్స్ ఇండియా సంస్థ సీఈవో, చైర్మెన్ అయిన డి.రాజుకు వ్యాపార రంగంలో విశేషమైన అనుభవం ఉంది. నాయకత్వం, టర్నెరౌండ్ మేనేజ్మెంట్, వ్యూహాత్మక నిర్వహణ, కీలక ఖాతాల నిర్వహణ., ఇంజినీరింగ్ మరియు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రంగాలలో రాజుకు దాదాపు 37 ఏండ్ల అపార అనుభవం ఉంది.2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన సీఐఐ చైర్మెన్ బాధ్యతలను నిర్వహించేందుకు ఆయన అనుభవం అపారంగా కలిసిరానుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. 2019-20కి గాను సీఐఐ తెలంగాణ విభాగం వైస్ చైర్మెన్గా సైయంట్ సీఈవో, ఎండీ బోధనపు కృష్ణ ఎన్నికయ్యారు.