Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: రంగుల పండుగ హౌలీ పర్వదినం పురస్కరించుకొని దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం పని చేయలేదు. ఈక్విటీ మార్కెట్లతో పాటుగా డెరివెటివ్ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్లు, బులియన్ మార్కెట్లు పని చేయలేదు. శుక్రవారం మార్కెట్లు యథాతథంగా పని చేయనున్నాయి. హౌలీ సందర్భంగా మార్కెట్లకు సెలవు రానున్న నేపథ్యంలో బుధవారం ట్రేడింగ్లో మదుపరులు చాలా అప్రమత్తంగా వ్యవహరించారు. రోజంతా కన్సాలిడేషన్ బాటలో సాగిన కీలక సూచీలు చివరికి మిశ్రమంగా ముగించారు. సెన్సెక్స్ 23 పాయింట్లు ఎగిసి 38,386 వద్ద, నిప్టీ 11 పాయింట్లు నీరసించినా 11,521కి పైన ముగిశాయి.