Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ దిగ్గజం ఎల్ అండ్ టీ టేకోవర్ పంజా నుంచి తప్పించుకొనేందుకు గాను మైండ్ట్రీ బోర్డు చివరి సమరానికి సిద్ధమవుతోంది. టేకోవర్ను తప్పించుకొనేందుకు గాను సంస్థ ఎంచుకున్న బైబ్యాక్ ఆఫర్పై నిర్ణయం తీసుకొనేందుకు గాను ఆ సంస్థ బోర్డు ఈ నెల 26న మరోమారు సమావేశం కావాలని నిర్ణయించియంది. బైబ్యాక్ అంశంపై చర్చించేందుకు గాను బుధవారం సమావేశమైన బోర్డు ఒక స్పష్టమైన ఏకాభిప్రాయానికి రాలేక పోయింది. ఈ నేపథ్యంలో బోర్డు సమావేశం అర్ధాంతరంగా ముగింది. ఎల్ అండ్ టీ సంస్థ ప్రతిపాదించిన రూ.10,800 కోట్ల టేకోవర్ ప్రతిపాదన నుంచి తప్పించుకొనేందుకు గాను బోర్డు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో సంస్థ బైబ్యాక్ అవకాశాన్ని అస్త్రంగా చేసుకొని పోరాడాలని భావిస్తోన్న సంగతి తెలిసిందే.